Tirumala

Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో అపచారం.. బూట్ల‌తో అలిపిరి మెట్లు ఎక్కుతున్న వ్య‌క్తి

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకునే పరమ పవిత్రమైన అలిపిరి నడక మార్గంలో అపచారం చోటుచేసుకుంది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, కాలిబాటలో పాదరక్షలు లేకుండా నడుస్తూ గోవింద నామస్మరణతో కొండపైకి వెళ్తుంటారు. అలాంటి పరమ పావనమైన మెట్ల మార్గంలో ఒక వ్యక్తి యథేచ్ఛగా బూట్లు (షూ) ధరించి మెట్లు ఎక్కుతూ కనిపించడం స్థానికంగా పెను దుమారం రేపింది.

భక్తుల తీవ్ర ఆగ్రహం – నిఘా వైఫల్యంపై మండిపాటు:

సాధారణంగా అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల్లో పాదరక్షలు ధరించి నడవడాన్ని భక్తులు తీవ్ర అపచారంగా భావిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే మార్గంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంపై శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అలిపిరి మెట్ల మార్గం ప్రారంభంలో మరియు దారిపొడవునా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం పహారా కాస్తుంటారు. అయినప్పటికీ సదరు వ్యక్తి బూట్లతో మెట్లు ఎక్కుతుంటే సిబ్బంది ఎందుకు గమనించలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నడక దారుల్లో భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసి, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *