Ap news: లండన్లో తెలుగు టెక్కీ దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్ డెడ్ అయ్యాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన పి. చిరంజీవి (32) లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ఆయన తన కారులో మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనతో బూదవాడలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. విచారణ అనంతరం డెడ్ బాడీని ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.