Viral News: సమాజంలో ఇంకా కొందరు మగ సంతానం కోసమే ఆరాటపడుతున్న రోజుల్లో, ఒక కుటుంబం తమ ఇంటికి ఆడపిల్ల రావాలని ఏకంగా రెండు శతాబ్దాల పాటు వేచి చూసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫాలే కుటుంబంలో ఐదు తరాల తర్వాత, అంటే దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ ఆడపిల్ల జన్మించింది. తమ వంశంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టిందన్న ఆనందంతో ఆ కుటుంబ సభ్యులు చేసిన సంబరాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చిన్నారికి ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథం, మేళతాళాలు, బాజాభజంత్రీలు, నృత్యాలతో రాజసం ఉట్టిపడేలా గ్రామంలో ఘన స్వాగతం పలికారు.
“మా బాధ తీరిపోయింది” – కంటతడి పెట్టిన తాత
“పువ్వులా పెంచుకుంటాం” – తండ్రి మురిపెము..
ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునే మార్గమంతా కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్లపై భజనలు చేస్తూ, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్సులు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఆడపిల్ల పుట్టుకను ఒక పండుగలా జరుపుకుని, ఆమె రాకను చిరస్మరణీయం చేసిన ఈ ఘటన ఆడపిల్లల ప్రాధాన్యతను చాటుతూ సమాజానికి సరికొత్త స్ఫూర్తిని నింపుతోంది.
WATCH: A girl child born into Beed’s Dahiphale family has brought extraordinary joy after relatives said no girl had been born in the family for nearly 200 years. The newborn was taken home from hospital in a decorated chariot amid drums, fireworks and sweets. pic.twitter.com/aBDNlYA9Df
— Varad Bhatkhande | Journalist (@VaradBhatkhande) September 2, 2026
