KTR On Kaleshwaram

KTR On Kaleshwaram: కావాలనే కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

KTR On Kaleshwaram: తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ మరింత ముదురుతోంది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టును తాజాగా మరోసారి రాజకీయ రగడలకు వేదిక చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతుంది. కానీ ఈ దాడుల వెనుక అసలైన లక్ష్యం అభివృద్ధి కాదని, మాజీ సీఎం కేసీఆర్ గౌరవాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే ఈ రాజకీయ నాటకాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు

జూన్ 11న పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్న కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్–బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర ఇది అని కేటీఆర్ విమర్శించారు. నాలుగేళ్లలో పూర్తి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. అలాంటి ప్రాజెక్టును సాధించిన నేతలపై ఈ రోజు ఆరోపణలు చేయడం దురదృష్టకరం, కేటీఆర్ అన్నారు.

ఇది కూడా చదవండి: TGSRTC Fare Hiked: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్.. బస్‌పాస్‌ చార్జీలు భారీగా పెరిగాయి

వారి ఎజెండా పాలన కాదు… ప్రతీకారం! 

కేటీఆర్ వ్యాఖ్యలలో కసితో స్పష్టంగా వినిపించింది—ప్రస్తుత ప్రభుత్వం పాలన కాకుండా ప్రతీకార రాజకీయాలను  చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి కేసీఆర్‌ను చికాకు పెట్టే కుట్రలో నిమగ్నమయ్యాయి. నిజాలు లేని ఆరోపణలు, మీడియా మేనేజ్‌డ్ ప్రచారాలే వారి ఆయుధాలు అంటూ ఆయన ఆరోపించారు.

ప్రాజెక్ట్ వ్యవహారం వ్యక్తిగతమేం కాదు

కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని, ఇది మంత్రివర్గం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని హరీశ్ రావు ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు ఇద్దరూ పారదర్శకంగా జరిగిన పని అని చెప్పారు. దాచే విషయం ఏమీ లేదు, అని ఆయన తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే, అభివృద్ధి కంటే ప్రతిద్వంద్వ భావనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ను నేరవేత్తలా చూపించే ప్రయత్నాలపై ప్రజల అభిప్రాయమే తుది తీర్పు ఇస్తుందనడంలో సందేహం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maha Kumbh Mela: నా భార్య గర్భిణీ! సెలవు కావాలి.. ఏకంగా 700 మంది పోలీసుల లీవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *