TS News: తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరతపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ భవనం నుంచి వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం వరకు బీఆర్ఎస్ శాసనసభ్యులు పాదయాత్ర చేపట్టారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేయాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్న నేతలు ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలంటూ నినాదాలు చేశారు.
ధర్నా సమయంలో హరీష్రావు, కేటీఆర్ పోలీసులతో మాటలాటకు దిగారు. “రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎరువుల కోసం తహతహలాడుతున్నారు. ప్రభుత్వం మాట్లాడి యూరియా కొరతను తక్షణమే నివారించాలి” అని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ధర్నా తీవ్రత పెరగడంతో పోలీసులు హరీష్రావు, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
