Konda Surekha

Konda Surekha: ఆషాఢ మాస బోనాల రివ్యూ మీటింగులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు

Konda Surekha: హైదరాబాద్ నగరంలో బోనాల జాతర కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది మొత్తం 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

బోనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్ల బడ్జెట్‌ విడుదల చేసింది. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరింత సహాయం పొందేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్‌కు ఏర్పాట్లలో తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

జూన్ 26న గోల్కొండ కోటలో తొలి బోనం ప్రారంభం కానుంది. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు సందడి చేయనున్నాయి. బోనాల సందర్భంలో రంగం, తొట్టెల ఊరేగింపులు ప్రజల్ని ఆకట్టుకోనున్నాయి.

ఇది కూడా చదవండి: Covid 19 India Cases: అమ్మ బాబోయ్.. పెరుగుతున్న కరోనా కేసులు.. 7వేలకు దగ్గరలో కేసులు..

ఆలయాలకు ఇచ్చే చెక్‌లు రెవెన్యూ మరియు ఎండోమెంట్ శాఖ సమన్వయంతో పండుగకు ముందే పూర్తిచేయాలని నిబంధన విధించారు. అధికారులు ఈ బాధ్యతను ఉద్యోగంగా కాకుండా సేవగా భావించి నిర్వర్తించాలంటూ సూచనలు అందించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, దైవచింతనతో కూడిన వేడుకలు, పోలీసుల లా అండ్ ఆర్డర్‌ బాధ్యత, అన్ని విభాగాల సమన్వయంతో సమగ్రంగా చేపట్టనున్నారు. ఎక్కడా లోపాలు ఉండకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇంతటి పవిత్రమైన వేడుకలు సజావుగా జరగాలని, అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *