Khumbamela: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా ప్రాంగణంలో ఆదివారం భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. సాధువుల కోసం వేసిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, దీని దెబ్బతో ఆ ప్రాంతం మొత్తం భారీ పొగతో కమ్ముకుపోయింది. మంటలు ఎగిసిపడడంతో భక్తులు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోయారు.
ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలంలో పనిచేస్తున్నాయి. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.