Kerala High Court

Kerala High Court: ఆలయాల వద్ద నేతల పోస్టర్స్ వద్దు.. కోర్టు కీలక ఆదేశాలు

Kerala High Court: ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు – టీడీబీని అభినందిస్తూ లేదా రాజకీయ సందేశాలను తెలియజేసే పోస్టర్లను ఏర్పాటు చేయకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భక్తులు స్వామిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళతారు.  ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, టీడీబీ సభ్యుల ముఖాలు చూడడానికి కాదు అంటూ కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. 

ఇటీవల కేరళలోని అలప్పుజా జిల్లా చెర్తలా సమీపంలోని తురవూర్ మహాక్షేత్రం ఆలయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రి వీఎన్ వాసవన్, ప్రాంతీయ ఎమ్మెల్యే, టీడీబీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వేశారు. శబరిమల యాత్రికుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం,  టిడిబిని  ప్రశంసిస్తూ వీటిని ఏర్పాటు చేశారు.  దీనిపై హైకోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఈ వ్యవహారంపై టీడీబీతో పాటు సంబంధిత అధికారులను కోర్టు స్పందన కోరింది.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో రిజర్వేషన్ నిరసనలు హింసాత్మకం

Kerala High Court: విరాళంగా ఇచ్చిన డబ్బుతో పోస్టర్లు అంటించవద్దని హైకోర్టు పేర్కొంది.  దీనిపై అసహనం వ్యక్తం చేసిన  జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణ ఎస్ తో కూడిన ధర్మాసనం ఇలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని పేర్కొంది. మీరు దేవాలయాల యజమానులని అనుకోకండి అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. బోర్డు ధర్మకర్త, ఇది ఆలయ నిర్వహణ మాత్రమే చేస్తుంది. తురవూర్ ఆలయం శబరిమల యాత్రా సమయంలో దర్శనానికి భక్తులు వచ్చే ప్రదేశం, కాబట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడం TDB బాధ్యత. భక్తుల నుంచి వచ్చే విరాళాలను పోస్టర్ల ఏర్పాటుకు వినియోగించరాదని కోర్టు ఆదేశించింది. 

టీడీబీ నిర్వహణలో ఉన్న అన్ని స్థలాలతోపాటు అన్ని ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డుల గురించిన సమాచారాన్ని కోర్టు టీడీబీ నుంచి కోరింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  High Court: టీవీ చూడవద్దంటే అది హింస కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *