Karimnagar:

Karimnagar: అధికారుల నిర్ల‌క్ష్యం.. ఊరంతా జ‌ల‌మ‌యం

Karimnagar: సాగునీటి కాల్వ‌కు నీటిని వ‌దిలి అధికారులు కాల్వ క‌ట్ట ప‌రిస్థితిని క‌నీసం ప‌రిశీలించ‌లేక‌పోయారు. నీటిని వ‌దిలి చేతులు దులుపుకోవ‌డంతో బ‌ల‌హీనంగా ఉన్న చోట క‌ట్ట తెగింది. ఆ అధికారుల నిర్ల‌క్ష్యంతో ఓ ఊరంతా నీటిమ‌యం అయింది. నీటి విడుద‌ల‌కు ముందే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి ఉంటే ఆ ఊరు మునిగేది కాదు.. నీరు వృథా అయ్యేదీ కాదు.

Karimnagar: క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని తోట‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ లింకు కెనాల్ ద్వారా చిగురుమామిడి, తిమ్మాపూర్ మండ‌లాల్లోని ఎగువ ప్రాంతాల‌కు నీటిని విడుద‌ల చేశారు. దీంతో తిమ్మాపూర్ మండ‌లం మ‌న్నెంప‌ల్లి గ్రామ ప‌రిధిలో కాల్వ క‌ట్ట‌కు గండిప‌డింది. కాల్వ నీరంతా మ‌న్నెంప‌ల్లి ఊరిలోకి వ‌ర‌దై పారింది. దీంతో ఇండ్ల‌లోకి నీరు చేరి వ‌స్తు సామ‌గ్రి అంతా కొట్టుకుపోయింది. ఊరంతా జ‌ల‌మ‌యం అయింది.

Karimnagar: ప్ర‌భుత్వం కానీ, అధికారులు కానీ ముంద‌స్తుగా కెనాల్ ప‌రిస్థితిని అంచనా వేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని గ్రామ‌స్థులు ఆరోపిస్తున్నారు. ముంద‌స్తుగా మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని చెప్తున్నారు. ఇప్ప‌టికైనా మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి నీటిని విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Birthright Citizenship: ట్రంప్ కి షాకిచ్చిన కోర్టు.. ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న న్యాయమూర్తి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *