WTC Points Table 2026: శ్రీలంకతో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఐదో రోజు ఆటలో బౌలర్లు విజృంభించడంతో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత యువ ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) తన స్పిన్ మాయాజాలంతో లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మానవ్ సుతార్ సంచలనం: మ్యాచ్లో 10 వికెట్లు!
24 ఏళ్ల యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఈ మ్యాచ్లో అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు..
-
రెండో ఇన్నింగ్స్ మెరుపులు: 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను సుతార్ తన స్పిన్ ఉచ్చులో బిగించాడు. కేవలం 23.4 ఓవర్లలో 55 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో లంక జట్టు 206 పరుగులకే ఆలౌట్ అయింది.
-
తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు: తొలి ఇన్నింగ్స్లోనూ 76 పరుగులకు 4 వికెట్లు తీసిన సుతార్.. ఈ టెస్టులో మొత్తంగా 10 వికెట్లు సాధించి భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టిక పరిస్థితి..
ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) సైకిల్లో భారత్ 10 టెస్టుల్లో 5వ విజయాన్ని నమోదు చేసింది. భారత్ పాయింట్ల సంఖ్య 64కు చేరగా, పాయింట్ల శాతం (PCT) 53.33%కి మెరుగుపడింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలోనే కొనసాగుతోంది.
| స్థానం | జట్టు | మ్యాచ్లు | గెలుపు | ఓటమి | డ్రా | PCT (%) |
| 1 | ఆస్ట్రేలియా | 9 | 7 | 2 | 0 | 77.77% |
| 2 | దక్షిణాఫ్రికా | 4 | 3 | 1 | 0 | 75.00% |
| 3 | న్యూజిలాండ్ | 6 | 4 | 1 | 1 | 72.22% |
| 4 | బంగ్లాదేశ్ | 5 | 3 | 1 | 1 | 66.67% |
| 5 | భారత్ | 10 | 5 | — | — | 53.33% |
| 6 | శ్రీలంక | — | — | — | — | 33.33% |
ఫైనల్ చేరాలంటే ఏం జరగాలి?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరాలంటే అగ్రస్థానంలో నిలిచే టాప్-2 జట్లలో భారత్ ఉండాల్సి ఉంటుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో 0-2తో వైట్వాష్కు గురవ్వడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది.
ప్రస్తుత సైకిల్లో భారత్కు ఇంకా 8 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి:
-
శ్రీలంకతో రెండో టెస్టు
-
న్యూజిలాండ్తో 2 టెస్టుల సిరీస్
-
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 5 టెస్టుల భారీ సిరీస్
ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మిగిలిన 8 మ్యాచ్లలో భారత్ కనీసం 6 మ్యాచ్లలో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది.
