Hyderabad

Hyderabad: రాచకొండ లో గన్స్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Hyderabad: నగరంలో తుపాకుల విక్రయం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తుపాకులు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాకు చెందిన హరేకృష్ణ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు దేశవాళీ తుపాకులు, ఒక తపంచా, 10 లైవ్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.

హైదరాబాద్‌లో తుపాకులు విక్రయించేందుకు వచ్చినా ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు ప‌ది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు.

తుపాకుల విక్ర‌యించేందుకు ముఠాకు సూత్ర‌ధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఠా సభ్యులు ఎవరి కోసం గన్స్ తీసుకొచ్చారు..గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా అని కూడా ఆరా తీస్తున్నారు. ముఠా సభ్యులకు నగరంలో సంబంధాలు ఉన్నందునే వారు రాష్ట్రానికి గన్స్ అమ్మకానికి వచ్చారని పోలీసులు భావిస్తున్నారు.

గ‌త ఏడాది కూడా హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్స్‌లతో సొంతంగా తుపాకులు తయారు చేస్తూ అమ్ముతున్న మూఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 34 నకిలీ లైసెన్సులు, 33 తుపాకీలు, 140 రౌండ్స్ బులెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆ కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ బుల్డోజ‌ర్ క‌ల‌క‌లం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *