Gold Price Today

Gold Price Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే?

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ రూట్ మార్చాయి. వరుసగా మూడు నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, రూపాయి విలువ మారడమే దీనికి ముఖ్య కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో, ఈ ధరల పెరుగుదల సామాన్యుల జేబులకు చిల్లు పెడుతోంది.

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చూస్తే.. ఇది కేవలం మన దేశంలోని డిమాండ్‌పైనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం కంటే, సురక్షితంగా ఉండే బంగారంపై పెట్టుబడి పెట్టడానికే అందరూ ఇష్టపడతారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో శుక్రవారం ఉదయం సమయానికి ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940 గా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610 వద్ద కొనసాగుతోంది. బంగారంతో పాటే వెండి కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ.2,85,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

మన దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ ప్రాంతాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,59,940 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,610 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,57,200 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,610 గా ఉంది. అన్నింటికంటే ఎక్కువగా చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,61,680 కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,110 వద్ద పలుకుతోంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *