Vijayasai Reddy

Vijayasai Reddy: ప్లీనరీలో నాపై సజ్జల భౌతిక దాడి.. విజయసాయిరెడ్డి సంచలన బహిరంగ లేఖ..

Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేసిన తాజా బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో తనపై ‘నమ్మకద్రోహి’ అంటూ వైసీపీ కోటరీ చేస్తున్న దుష్ప్రచారానికి గట్టి కౌంటర్ ఇస్తూ.. సజ్జల రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు. పార్టీలో తాను ఎదుర్కొన్న తీవ్ర అవమానాలను, ప్లీనరీ వేదికగా జరిగిన భౌతిక దాడిని లేఖలో ప్రస్తావిస్తూ తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

ప్లీనరీలో నాపై భౌతిక దాడి.. జగన్ కేవలం ప్రేక్షకుడు..

2022 ప్లీనరీ ఘటన..
మంగళగిరిలో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నేరుగా భౌతిక దాడికి దిగారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్ కేవలం ప్రేక్షకపాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
74 అవమానాలు..
పార్టీలో తనను పక్కన పెట్టేందుకు “సాయన్న ముసలోడైపోయాడు, వయసైపోయింది” అంటూ ప్రచారం చేసి అనుబంధ సంఘాలు, ఉత్తరాంధ్ర, గుంటూరు-తిరుపతి జిల్లాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి, చివరకు కోర్ కమిటీ నుంచి తప్పించారని పేర్కొన్నారు. ఇలాంటివి ఏకంగా 74 అవమానాలు ఎదుర్కొన్నానని, ఎన్నో బాధలను కడుపులోనే దాచుకున్నానని వెల్లడించారు.

సజ్జల టీడీపీ కోవర్ట్.. నాపై అక్రమ కేసులు..

కాంగ్రెస్‌తో రాజీ పడలేదు..
తాను నమ్మకద్రోహినైతే నాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో రాజీ చేసుకుని సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో పేరు లేకుండా చేసుకునేవాడినని అన్నారు. జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే కాంగ్రెస్ తనను ఏ-2గా చేర్చిందని, జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తాను 15 నెలలు జైలు జీవితం గడిపానని గుర్తుచేశారు.

 

కూటమి ప్రభుత్వంలో సజ్జలకు రక్షణ?..
2024 ఎన్నికల తర్వాత తనకు సంబంధం లేకపోయినా లిక్కర్ స్కామ్‌లో ఏ-5గా, కాకినాడ పోర్ట్ కేసులో ఏ-2గా చేర్చారని తెలిపారు. అయితే రెండున్నరేళ్ల కూటమి పాలనలో ‘సకల శాఖల మంత్రి’ సజ్జల పేరు ఏ చార్జిషీట్‌లోనూ లేకపోవడం వెనుక ఆయన నడుపుతున్న కోవర్ట్ రాజకీయాలే కారణమని విమర్శించారు.

వైసీపీలో సజ్జల నంబర్ 1.. జగన్ నంబర్ 2 

2019 విజయం తర్వాత సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ సభ్యులు ఎవరూ జగన్‌ను కలవకుండా మధ్యలో గోడ కట్టారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం వైసీపీలో నంబర్ 1 సజ్జల, నంబర్ 2 జగన్. ఆ కొత్త నంబర్ వన్‌కు సాష్టాంగ నమస్కారాలు పెట్టడం నా వల్ల కాదు” అని స్పష్టం చేశారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని వదులుకున్నానని, జగన్‌ను మోసం చేస్తూ తెరవెనుక కోవర్ట్ రాజకీయం చేయడం తనకు రాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రత్యక్ష పోరాటం చేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి మరిన్ని పూర్తి ఆధారాలతో నిజాలు బయటపెడతానని విజయసాయిరెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *