Delhi:మోదీ చైనా పర్యటన ఖరారు , భారత్-చైనా సంబంధాల్లో కొత్త దిశ?

Delhi: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలోఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో పర్యటించనున్నారు. టియాంజిన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకే ఈ పర్యటన జరుగుతోంది. మోదీ 2019 తర్వాత చైనాలో అడుగుపెడుతున్నది ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ సదస్సులో భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ వంటి సభ్యదేశాలు పాల్గొంటున్నాయి. సమాచార భద్రత, అంతర్జాతీయ మాఫియా (ట్రాన్స్‌నేషనల్ క్రైమ్), మాదకద్రవ్యాల నివారణపై కీలక చర్చలు జరగనున్నాయి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం మరింత పెరిగింది.

వీటితో పాటు, భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇది కీలకమైన అవకాశం అన్న భావన విదేశాంగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవలే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుసుకున్న సంగతి తెలిసిందే.

ట్రంప్ టారిఫ్‌లు – చైనా టూర్‌కి కొత్త ప్రయోజనం?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% టారిఫ్‌లు, రష్యా చమురు కొనుగోళ్లపై పెట్టిన అదనపు ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు ఆర్థిక దృష్టితో కూడిన ప్రాధాన్యత ఏర్పడింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం –

ఈ పర్యటన ద్వారా భారత్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆభరణాల వంటి ఎగుమతులపై ప్రభావాన్ని తగ్గించేందుకు మార్గాలు వెతకనుంది. ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల అమెరికాపై అధికంగా ఆధారపడకూడదన్న ఆలోచనతో భారత్‌… చైనాతో సంబంధాలను మెరుగుపరిచి, వ్యాపార పరంగా కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిష్కారాన్ని ఆశిస్తోంది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *