Pakistan

Pakistan: పాకిస్థాన్‌లో సున్నీ-షియా ముస్లిం గ్రూపుల ఘర్షణ.. 40 మంది మృతి!

Pakistan: పాకిస్థాన్‌లో సాయుధ సున్నీ-షియా ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో 40 మంది చనిపోయారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో సున్నీ ముస్లింలు మెజారిటీ, షియా ముస్లింలు 15 శాతం మైనారిటీ. ఈ రెండు వర్గాల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఖురారం జిల్లాలో సున్నీ, షియా ముస్లింల మధ్య గత జూలైలో భూ వివాదం చెలరేగింది. ఆ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో కురారం జిల్లాలోని బగన్ ప్రాంతంలో గత రాత్రి సున్నీ, షియా సాయుధ సమూహాల మధ్య హింస చెలరేగింది.

ఇది కూడా చదవండి: Maharashtra: విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. ఒక్కసారిగా అగ్నిప్రమాదం

Pakistan: ఇరువర్గాలు దుకాణాలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. తుపాకులతో సహా ఆయుధాలతో వంతులవారీగా పోరాడారు.దాడి ఫలితంగా రెండు వైపులా మొత్తం 40 మంది మరణించారు; 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 21వ తేదీన ఉగ్రవాదులు వాహనాలపై కాల్పులు జరపడంతో 50 మందికి పైగా పౌరులు చనిపోయారు.ఆ షాకింగ్ ఇన్సిడెంట్ నుంచి దేశం బయటపడక ముందే మరో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *