Crime News: ఇది కఠినాత్మురాలైన ఓ తల్లి నిర్వాకం.. కన్నపేగును దూరం చేసుకున్న దౌర్భాగ్యురాలి వంచన.. వివాహేతర బంధం కోసం ముగ్గురు కన్నబిడ్డలను కడతేర్చి, జైలు ఊచలు లెక్కిస్తున్న ఓ దుర్మార్గురాలి కాఠిన్యాన్ని మరువక ముందే కామారెడ్డి జిల్లా పరిధిలో మరో ఘటన చోటుచేసుకున్నది. వివాహేతర సంబంధీకుడికి ఆటో కొనేందుకు తన కడుపున పుట్టిన ఐదేండ్ల కొడుకును అమ్మేసిన ఘటనపై సభ్య సమాజం ఆందోళన చెందుతున్నది.
Crime News: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు నర్సింలు అనే వ్యక్తితో ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు కలిగారు. కొంతకాలం క్రితం నర్సింలు అనారోగ్యంతో చనిపోయాడు. ఈ దశలో లావణ్య ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషించుకోసాగింది.
Crime News: ఈ నేపథ్యంలో లింగంపేట మండలం పర్మళ్ల గ్రామానికి చెందిన సాయిలుతో లావణ్యకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో సాయిలు భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత సాయిలు, లావణ్య కామారెడ్డిలోనే కాపురం పెట్టి సహజీవనం చేస్తున్నారు. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
Crime News: కూలిపనులతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఉపాధి కోసం ఆటో కొందామని లావణ్య, సాయిలు నిర్ణయించుకున్నారు. దానికోసం డబ్బుల్లేక అవస్థలు పడ్డారు. తాను ఉపవాసం ఉండి, ఇల్లిల్లూ అడుక్కొని అయినా కన్నపిల్లలను సాకే బాధ్యత తీసుకోవాల్సిన ఆ మహిళ కడుపున పుట్టిన కొడుకైన నిఖిల్ (5)ను విక్రయించి, ఆ సొమ్ముతో ఆటో కొనేందుకు సిద్ధమైంది.
Crime News: పర్మిళ్ల గ్రామానికే చెందిన నసీమా అనే మహిళకు రూ.50 వేలకు ఆ బాలుడిని లావణ్య అమ్మేసింది. నసీమా ఆ బాలుడిని తన చెల్లి షహీదాకు ఇవ్వగా, షహీదా ఆ బాలుడిని రూ.1 లక్షకు శేఖర్ అనే వ్యక్తికి అమ్ముకున్నది. ఆ నోటా ఈ నోటా ఈ విషయం కాస్తా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు చేరింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంటరయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. లావణ్య, సాయిఉలు, నసీమా, షహీదా, శేఖర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.