3D Rangoli: ప్రపంచంలోనే అతిపెద్ద 3డి ముగ్గును భోపాల్లోని శౌర్య స్మారక్లో తయారు చేశారు. ఈ రంగోలిలో స్వామి వివేకానంద, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ చిత్రాలను చెక్కారు. అంతేకాకుండా, ఇది యువశక్తి మిషన్ నినాదం “సంభాషణ, బలం, శ్రేయస్సు” సందేశాన్ని కూడా తెలియజేస్తుంది.
18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగోలీ..
ప్రముఖ రంగోలి కళాకారిణి శిఖా శర్మ జోషి తన బృందంతో కలిసి ఈ రంగోలిని రూపొందించారు. శిఖా శర్మ జోషి ఇండోర్ నివాసి అయిన ప్రపంచ ప్రసిద్ధ రంగోలి కళాకారిణి. ఆమె తన బృందంతో కలిసి గత మూడు రోజుల్లో సుమారు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రంగోలీని సిద్ధం చేశాడు.
ఇది కూడా చదవండి: Makar Sankranti: తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
3D Rangoli: ఈ రంగోలీ తయారీలో దాదాపు 4,000 కిలోల రంగులు వాడినట్లు శిఖా తెలిపారు. ఇప్పటి వరకు రంగోలి కళలో ఎన్నో రికార్డులు నెలకొల్పామని, అయితే ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ రంగోలీని రూపొందించిన అనుభవం తనకు చాలా ప్రత్యేకమని చెప్పింది.
తాను స్వయంగా మధ్యప్రదేశ్ వాసినని, యువజన దినోత్సవం సందర్భంగా ఈ రంగోలీని తయారు చేయడం గర్వంగా, సంతోషంగా ఉందని శిఖా చెప్పింది. యువశక్తి మిషన్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
अद्भुत कौशल और अतुलनीय कला से समृद्ध हमारी युवा बेटियां
आज स्वामी विवेकानंद जी की जयंती ‘युवा दिवस’ के अवसर पर शौर्य स्मारक, भोपाल में माँ भारती की प्रतिमा पर पुष्प अर्पित कर बेटी शिखा शर्मा द्वारा स्वामी विवेकानंद जी पर आधारित 18,000 स्क्वायर फीट में बनी विश्व की सबसे बड़ी 3-D… pic.twitter.com/NWKBIqwddF
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 12, 2025