Chandrababu: స్విజర్లాండ్ లో రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పిన చంద్రబాబు..

Chandrababu: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిని తాను ముందే ఊహించానని, ఆ దిశగా తీసుకున్న చర్యల వల్లే నగరం ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు.

“మొదటిసారిగా తానే ఐటీ గురించి మాట్లాడిన వ్యక్తిని,” అని గుర్తుచేసుకున్న చంద్రబాబు, “హైదరాబాద్‌లో భూములు అమ్మకూడదని అప్పట్లోనే నేను స్పష్టం చేశాను. ఈరోజు హైదరాబాద్ వల్ల దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చింది,” అని పేర్కొన్నారు.

అతను ఉద్యోగాలు చేయడం మాత్రమే కాకుండా, ఇచ్చేస్థాయికి రావాలని ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడినని చెప్పారు. “హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకురావడానికి నేను ఎంత శ్రమ చేశానో అందరికీ తెలిసిందే,” అని చంద్రబాబు వివరించారు.

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ, తన హయాంలో హైదరాబాద్‌లో నిర్మించిన నిర్మాణాలను కూల్చలేదని, వాటి వల్ల నగర అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. నిరంతరం శ్రమించడం వల్లే తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP news: ఇదేందయ్యా ఇది.. పందుల పోటీల.. నేనెప్పుడూ చూడలే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *