Ram Mandir Theft Case: అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాల చోరీ కేసులో పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ప్రయాగ్రాజ్లో నిర్వహించిన చారిత్రాత్మక కుంభమేళా (Kumbh Mela) సమయంలోనే ఈ మెగా దోపిడీ జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి. కుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని కూడా దర్శించుకోవడంతో.. ఆ సమయంలో ఆలయ హుండీలకు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయి. ఇదే అదునుగా భావించిన నిందితులు లెక్కింపు గదిలోకి (Account Room) అక్రమంగా ప్రవేశించి కోట్ల రూపాయల కానుకలను మాయం చేశారు.
ఈ సంచలన కేసు (Ayodhya Ram Temple Theft Case) లో ఇప్పటివరకు 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, అక్రమ ఆస్తులను అంగుళం అంగుళం తవ్వితీసేందుకు ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ (IT) తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగుతోంది.
ఆవుపేడ కింద లక్షల నగదు.. రూ. 12 వేల జీతగాడి బినామీ ఆస్తులు!
పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో నిందితులు దొంగిలించిన సొమ్మును ఎక్కడెక్కడ దాచారో చూసి అధికారులు సైతం షాక్కు గురయ్యారు. రికవరీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
-
ఆవుపేడ కింద దాచిన సొమ్ము: నిందితుడైన లవ్కుష్ మిశ్రా పూర్వీకుల ఇంటి ఆవరణలో.. ఎవరికీ అనుమానం రాకుండా ఆవుపేడ (పేడకళ్లం) కింద దాచిన రూ. 12 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతినెలా కేవలం రూ. 12 వేల జీతం తీసుకునే ఈ మిశ్రా, చోరీ సొమ్ముతో తన భార్య పేరు మీద రూ. 25 లక్షల విలువైన ఇల్లు కట్టినట్లు గుర్తించారు.
-
యోగా సెంటర్లలో సోదాలు: కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే నిందితుడు అవినాశ్ శుక్లా ఇచ్చిన సమాచారంతో పోలీసులు తొలుత రూ. 89 లక్షల నగదును రికవరీ చేశారు. అనంతరం అతని కుటుంబానికి చెందిన ఒక యోగా సెంటర్పై దాడి చేసి మరో రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
-
యాదవ్ ఇళ్లలో గుట్టలు: మరో నిందితుడు మనీశ్ కుమార్ యాదవ్ ఇల్లు, రాంశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఇళ్లపై దాడులు చేసి వరుసగా రూ. 36 లక్షల నగదు, భారీగా బంగారం (Jewelry) మరియు బినామీ ఆస్తుల పత్రాలను (Property Documents) సీజ్ చేశారు.
ఎస్బీఐ (SBI) సిబ్బందితో కుమ్మక్కు.. లెక్కింపు గదిలోనే దోపిడీ!
ఈ కేసులో అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగుల పాత్రపై బలమైన అనుమానాలు వ్యక్తమవడం.
రామ మందిర విరాళాల లెక్కింపు బాధ్యతలను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తోంది. నాలుగు పెద్ద డొనేషన్ బాక్సుల (హుండీల) లోని డబ్బును లెక్కించడానికి 14 మంది సభ్యులతో కూడిన బృందం ఉంటుంది. ఇందులో 11 మంది బ్యాంక్ ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్ట్ సభ్యులు ఉంటారు. నిందితులు ఈ బ్యాంక్ సిబ్బందితోనే కుమ్మక్కై, కౌంటింగ్ రూమ్లోకి నిరాటంకంగా యాక్సెస్ సంపాదించి పక్కా ప్లాన్ ప్రకారం ప్రతి నెలా కోట్ల రూపాయలను అక్రమంగా తరలించినట్లు దర్యాప్తుదారులు అంచనా వేస్తున్నారు.
అరెస్టయిన 8 మంది అంతరాష్ట్ర నిందితుల జాబితా:
విచారణ ముమ్మరం
పవిత్రమైన అయోధ్య రామాలయ నిధులను కొల్లగొట్టిన ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? బ్యాంకు ఉన్నతాధికారుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ నిధులకు సంబంధించిన కేసు కావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ దర్యాప్తును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
