APSRTC: జాక్ పాట్ కొట్టిన APSRTC.. పండగకు భారీ లాభాలు..

APSRTC: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) భారీగా ఆదాయం నమోదు చేసింది. పండుగ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ప్రజలకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాయి.

7,200 ప్రత్యేక బస్సులు పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఎక్కువగా పల్లె ప్రాంతాలు, ప్రధాన నగరాలు, పట్టణాలకు ప్రత్యేక సేవలను కల్పించారు.

సంక్రాంతి సందర్భంగా పండుగ రద్దీ కారణంగా బస్సుల్లో భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు APSRTC రూ.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది.

ఈ పండుగ రోజుల్లో APSRTC సుమారు 4 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే వీలుండటంతో బస్సులను ప్రజలు అధికంగా వాడుకుంటున్నారు.

APSRTC అధికారులు ఈ పండుగ కాలం తమ ఆదాయాన్ని పెంచే అవకాశం మాత్రమే కాకుండా, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికీ ఉపయోగపడిందని చెప్పారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *