amaravati: ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న హతం

amaravati: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం జీకే వీధి ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం అక్కడ కూంబింగ్‌ ఆపరేషన్* కొనసాగుతోంది. మృతి చెందిన మావోయిస్టులలో కీలక నేత జగన్ అలియాస్ పండన్నగా గుర్తించారు. ఆయనపై ప్రభుత్వం ఇప్పటికే రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించింది.

జగన్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా మరియు రమేష్ కూడా ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్టు సమాచారం అందింది. వీరిలో కొందరు ప్రాంతీయ కమిటీ స్థాయి నేతలుగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనతో ఏవోబీ ప్రాంతంలో మావోయిస్టుల చాపకింద నీరులా సాగుతున్న కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా బలగాలు ఇంకా అప్రమత్తంగా ఉండి, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adulterated Milk: కల్తీ పాలను ఇలా గుర్తించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *