Allu Arjun: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ, ప్రస్తుతం తన నెక్స్ట ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, బన్నీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా బన్నీతో చేయబోతున్నట్లు గతంలో వెల్లడించాడు.త్రివిక్రమ్ చాలా బలమైన కథతో రాబోతున్నాడని తెలుస్తోంది.
అందుకే స్టోరీ రైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు.బన్నీతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కదని.. 2025 సెకండ్ ఆఫ్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఆయన తాజాగా కామెంట్ చేశారు. దీంతో బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్కు ఇంకొంత సమయం పడుతుందని తేలిపోయింది.