Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి రెండో పాట ‘శశిరేఖ’ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
అభిమానుల ఉత్సాహం దృష్ట్యా, ఈ పాటను వాస్తవానికి సోమవారం విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, ఒక రోజు ముందుగానే ఆదివారం విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ స్వీయ సంగీత దర్శకత్వంలో మధుప్రియతో కలిసి ఆలపించారు.
Also Read: Netflix: 7 లక్షల కోట్ల డీల్ ఓకే చేసిన Netflix
ఈ చిత్రం నుంచి ఇదివరకే విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట ఇప్పటికే సూపర్ హిట్గా నిలిచి, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటూ అత్యధిక వీక్షణలను సాధిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండటంతో, ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని 2026 సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

