Kangana Ranaut

Kangana Ranaut: రైతులపై ట్వీట్.. కోర్టులో విచారం వ్యక్తం చేసిన కంగనా

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వివాదాస్పద 2020 ట్వీట్‌పై దాదాపు ఐదేళ్ల తర్వాత విచారం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమం సందర్భంగా వృద్ధ మహిళా రైతును కంగనా తప్పుగా గుర్తించి, ఆమె నిరసనల్లో పాల్గొనడానికి కేవలం రూ. 100 తీసుకుంటుందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమై, పలు లీగల్ నోటీసులకు దారితీసింది.

సోమవారం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా, కంగనా రనౌత్ ఆ వివాదాస్పద వ్యాఖ్యకు చింతిస్తున్నట్లు (regret) ప్రకటన చేశారు.

వివాదం ఎలా మొదలైంది?

  • ఘటన: డిసెంబర్ 2020లో, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీ వైపు కవాతు చేస్తున్న సమయంలో ఈ వివాదం చెలరేగింది.
  • తప్పుగా గుర్తించడం: కంగనా రనౌత్ తన ట్వీట్‌లో, పంజాబ్‌కు చెందిన వృద్ధ రైతు మహీందర్ కౌర్ను షాహీన్‌బాగ్‌లో CAA వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ దాదీగా తప్పుగా గుర్తించారు.
  • వివాదాస్పద ఆరోపణ: ఆ మహిళ ప్రదర్శనలకు హాజరు కావడానికి కేవలం రూ. 100కు అందుబాటులో ఉంటుంది అని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Ramya Moksha: ఇంకా నిబ్బా నిబ్బీలా ప్రవర్తిసాడు.. పోతు పోతు బాంబు పేల్చిన రమ్య

న్యాయ పోరాటం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

రనౌత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పంజాబీ గాయకుడు-నటుడు దిల్‌జిత్ దోసాంజ్ కూడా బహిరంగంగా కంగనాను మందలించడంతో వారిద్దరి మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవ జరిగింది.

కంగనా ఆ ట్వీట్‌ను తొలగించినప్పటికీ, పంజాబ్‌లోని బటిండా జిల్లాకు చెందిన 73 ఏళ్ల మహీందర్ కౌర్ ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంగనా రనౌత్ తనపై ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. “మీరు మసాలా జోడించారు. ఇది సాధారణ రీట్వీట్ కాదు” అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో, దాదాపు ఐదేళ్ల తర్వాత కంగనా రనౌత్ తన ట్వీట్‌పై విచారం వ్యక్తం చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *