pakistan: పాకిస్తాన్ లో ఆత్మహుతి.. 16 మంది సైనికులు మృతి

pakistan: పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాద దాడికి బలైంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 24 మందికి పైగా గాయపడగా, వీరిలో పౌరులు, చిన్నారులు ఉన్నారు.

స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఒక ఆత్మాహుతి ఉగ్రవాది వేగంగా నడిపి సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా నాశనమయ్యాయి. పేలుడి ప్రభావంతో సమీపంలోని రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.

మొదట మృతుల సంఖ్య 13గా ప్రకటించబడినప్పటికీ, తరువాత చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందడంతో మొత్తం 16 మంది సైనికుల మరణం అధికారికంగా నిర్ధారితమైంది

ఈ దాడికి బాధ్యత తామే అని పాకిస్థానీ తాలిబన్‌కు చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్థాన్-ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.

పాక్ ప్రభుత్వం తరచుగా, తమ భూభాగంలోకి ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడుతున్నారన్న ఆరోపణలు చేస్తోంది. అయితే, ఆ ఆరోపణలను కాబూల్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది.

2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో ఉగ్రదాడుల వల్ల సుమారు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలా మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. తాజా ఘటనతో సరిహద్దు భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  mohammed siraj: భావోద్వేగానికి గురైన మహ్మద్‌ సిరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *