Accident in Yadadri: తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో శనివారం ఘోర దర్ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
