Land Survey: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పరిసరాల్లో రెవెన్యూ అధికారుల భూ సర్వే శనివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఇటీవల తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా అధికారులు ఈ సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. మొత్తం మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయిన రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల హద్దులను నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు.
సర్వే నంబర్ 325పై ప్రత్యేక దృష్టి – శాటిలైట్ టెక్నాలజీతో పరిశీలన..
అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి అసైన్డ్ భూములను గుర్తిస్తూ మార్కింగ్ వేస్తున్న నేపథ్యంలో స్థానిక రైతులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి హద్దుల నిర్ధారణపై ఆందోళన చెందుతూ సర్వే అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
