Influencers

Influencers: సోషల్ మీడియా క్రియేటర్లకు బంపర్ ఆఫర్.. రూ. లక్ష వరకు నగదు బహుమతి

Influencers: డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న యువ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిహార్ ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజోపయోగ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్రియేటర్ల ప్రతిభను ప్రోత్సహిస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

రాష్ట్ర సోషల్ మీడియా పాలసీలో చేసిన కీలక సవరణలకు బిహార్ మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హత పొందిన క్రియేటర్లు వీడియోలు చేసి, గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందుకోవచ్చు.
వ్యూస్ ఆధారంగా నగదు బహుమతి – పరిమితులు..
వీడియో రీచ్ మరియు వీక్షణల ఆధారంగా ప్రభుత్వం చెల్లింపుల శ్లాబ్‌లను ఖరారు చేసింది:
  • లక్ష వ్యూస్‌కు రూ. 10,000: అర్హత పొందిన వీడియో విడుదలైన 30 రోజుల తర్వాత నమోదైన వీక్షణలను లెక్కించి, ప్రతి 1 లక్ష వ్యూస్‌కు రూ. 10,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు.
  • గరిష్ఠంగా రూ. 1 లక్ష: వీడియో 10 లక్షల వ్యూస్‌ను దాటితే గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు చెల్లిస్తారు. వ్యూస్ 10 లక్షలకు మించి ఎన్ని కోట్లలో వచ్చినా ఒక వీడియోకు లభించే గరిష్ఠ మొత్తం రూ. 1 లక్ష మాత్రమే.

ప్రతి వీడియోకు నగదు రాదు – కఠిన నిబంధనలు:

సోషల్ మీడియాలో కేవలం ఒక వీడియో వైరల్ అయినంత మాత్రాన నగదు రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పారదర్శకతను కాపాడేందుకు పలు షరతులు విధించింది:
  1. IPRD లో ఎంప్యానెల్‌మెంట్ తప్పనిసరి: ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే క్రియేటర్లు, సంస్థలు ముందుగా బిహార్ సమాచార, ప్రజా సంబంధాల విభాగం (IPRD Bihar Portal) వద్ద అధికారికంగా తమ పేర్లను నమోదు (Empanel) చేసుకోవాలి.
  2. కంటెంట్ నాణ్యత & వాస్తవికత: వీడియోను ఏ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, సమాచారం ఎంతవరకు ఖచ్చితంగా ఉంది, కంటెంట్ క్వాలిటీ ఎలా ఉందనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
  3. ఫేక్ వ్యూస్, బాట్లకు చెక్: ఆర్టిఫిషియల్ వ్యూస్, ఫేక్ ఫాలోవర్స్ లేదా బోట్ల ద్వారా వ్యూస్ పెంచే ప్రయత్నాలను నిరోధించడానికి ఎంప్యానెల్ అయిన ఛానెళ్ల ఫాలోవర్ల సంఖ్యను, ఎంగేజ్‌మెంట్‌ను ప్రత్యేక సాంకేతిక పద్ధతుల్లో అధికారులు నిరంతరం వెరిఫై చేస్తారు.

సాంప్రదాయ ప్రచార సాధనాల కంటే సామాన్యుడి చేతిలోని స్మార్ట్‌ఫోన్ ద్వారానే సంక్షేమ పథకాలు త్వరగా చేరువవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *