Revanth Reddy: హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై బహుజన వీరుడు, గోల్కొండ కోటపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
విగ్రహావిష్కరణ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి విగ్రహాన్ని ప్రజలకు అంకితం చేశారు.
భారీగా తరలివచ్చిన మంత్రులు & ప్రజాప్రతినిధులు..
ఈ చారిత్రక ఘట్టానికి రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు..
-
కీలక నేతల హాజరు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి. శ్రీధర్ బాబు, దనసరి అనసూయ (సీతక్క) తదితరులు పాల్గొన్నారు.
-
ప్రభుత్వ సలహాదారులు & ఎంపీలు: ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ హాజరయ్యారు.
-
ఎమ్మెల్యేలు & ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీగణేష్, ప్రకాష్ గౌడ్, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా పాపన్న గౌడ్:
సామాజిక న్యాయం, బహుజనుల పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ప్రతిష్టించడం పట్ల బీసీ సంఘాల నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.
