Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ వచ్చిన పసిడి ధరలు.. గత మూడు రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు ఉదయానికి రేట్లు ఎక్కడికక్కడ స్థిరంగా ఉన్నాయి. అంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అసలు బంగారం ధరలు రోజురోజుకూ ఎందుకు మారుతుంటాయో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్లో జరిగే లావాదేవీల ఆధారంగా ‘లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్’ వీటిని నిర్ణయిస్తుంది. ఈ వ్యాపారమంతా అమెరికన్ డాలర్లలో జరుగుతుంది. డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి, అదే డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు పెరుగుతుంటాయి. ఈ హెచ్చుతగ్గుల వల్లే మనకు ప్రతిరోజూ రేట్లలో మార్పులు కనిపిస్తాయి. అయితే మూడు రోజులుగా తగ్గిన రేట్లు, ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో ధరల వివరాల్లోకి వెళ్తే.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,060 గా ఉంది. అలాగే సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,800 వద్ద కొనసాగుతోంది. ఇక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,290 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే.. కేజీ వెండి ధర రూ.2,85,000 వద్ద స్థిరంగా ఉంది. శనివారం కూడా దాదాపు ఇవే ధరలు ఉండటంతో ఇవాళ కొనుగోలుదారులకు పెద్దగా భారం పెరగలేదు.
మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,060 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,45,800 గాను ఉంది. ముంబై, బెంగళూరు, కోల్కతా, కేరళ రాష్ట్రాల్లోనూ సరిగ్గా ఇవే ధరలు నడుస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రేట్లు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్లు రూ.1,59,210 ఉండగా, 22 క్యారెట్లు రూ.1,45,950 గా ఉంది. ఇక అన్నింటికంటే ఎక్కువగా చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,60,690 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,47,300 వద్ద ట్రేడవుతోంది. స్థానికంగా ఉండే పన్నులు, రవాణా ఖర్చుల వల్లే ఈ నగరాల మధ్య చిన్నపాటి ధరల తేడాలు ఉంటాయి.
