union budget 2025

Union Budget 2025: బడ్జెట్ అదిరింది.. మోదీ! బడ్జెట్ పై స్వపక్షాల చప్పట్లు.. విపక్షాల విసుర్లు ఇవే!

Union Budget 2025: బడ్జెట్‌ 2025 పై పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ను ప్రధాని అభినందించారు. ఆయన మాట్లాడుతూ- అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు, బడ్జెట్ చాలా బాగుంది అని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి సీతారామన్ కూర్చున్న బెంచ్ వద్దకు వెళ్లి, ఈ రోజు తన ఎనిమిదవ బడ్జెట్, మోదీ 3.0 ప్రభుత్వంలో మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ- “ఇది భారత ప్రభుత్వ బడ్జెట్‌ లేక బీహార్‌(Bihar) ప్రభుత్వ బడ్జెట్‌ అని అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాను. కేంద్ర ఆర్థిక మంత్రి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో బీహార్ కాకుండా మరే ఇతర రాష్ట్రం పేరు విన్నారా?” అని ఆయన అన్నారు.

బడ్జెట్‌కు సంబంధించి రాజకీయ పార్టీలు, నిపుణులు ఏమన్నారో ఇక్కడ తెలుసుకుందాం..

బడ్జెట్ అద్భుతంగా ఉందని అధికార పార్టీ నేతలు…

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyothiraditya Sindhia) మాట్లాడుతూ- ఈ బడ్జెట్ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం. కొత్త – శక్తివంతమైన భారతదేశం కలను నెరవేర్చడానికి ప్రధానమంత్రి సంకల్పం. ప్రతి ప్రాంతాన్ని సరిగ్గా అధ్యయనం చేసి, కొత్త మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఇది భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే పూర్తి బడ్జెట్. భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడమే కాకుండా ప్రపంచ అగ్రగామిగా ఈ బడ్జెట్ నిలబెడుతుంది అన్నారు.

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ – “మాకు బడ్జెట్ లెక్కల కంటే మహాకుంభ తొక్కిసలాటలో మరణించిన వారి డేటా చాలా ముఖ్యమైనది. ఎంత మంది చనిపోయారో, తప్పిపోయారో, గాయపడ్డారో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. తొక్కిసలాటలో ప్రజలు చనిపోతారని అభివృద్ధి చెందిన భారతదేశానికి మీ నిర్వచనం ఇదేనా?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ చమ్లా మాట్లాడుతూ- బడ్జెట్‌లో రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు, బీహార్‌కు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం చూశాము. అయితే, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. నేటి బడ్జెట్ ప్రసంగంలో రాజకీయ ఎజెండా ఉంది అంటూ విమర్సించారు.

డీఎంకే(DMK)  ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ- ఇది చాలా నిరాశాజనకమైన బడ్జెట్. 12 లక్షలపై పన్ను లేదంటూ ఆర్థిక మంత్రి పెద్ద సడలింపు ఇచ్చారు. అప్పుడు రూ.8-12 లక్షలకు 10% స్లాబ్ ఉందని చెప్పారు. కాబట్టి ఇది చాలా గందరగోళంగా ఉంది. ఈ ఏడాది బీహార్‌లో ఎన్నికలు ఉన్నందున బడ్జెట్‌లో బీహార్‌కు చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. తమిళనాడు లేదా మరే ఇతర దక్షిణాది రాష్ట్రానికి ఒక్క పదం కూడా బడ్జెట్ లో కనిపించలేదు.

ALSO READ  Delhi History: ఢిల్లీని 3 రోజుల్లో నాశనం చేశాడు ఓ పాలకుడు.. దానిని తిరిగి గాడిలో పెట్టడానికి వందేళ్లు పట్టింది.. తెలుసుకోవాల్సిన హిస్టరీ ఇది !

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *