Aghathiyaa: జీవా, అర్జున్ సర్జా, రాశీఖన్నా కీలక పాత్రలు పోషించిన అఘాధియా ఫాంటసీ హారర్ థిల్లర్ గా తెరకెక్కుతోంది. పా. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి మూడవ గీతం విడుదలైంది. ఈ పాట గురించి దర్శకుడు పా. విజయ్ మాట్లాడుతూ, ‘నేలమ్మ తల్లే’ అనే ఈ పాట భూమి వారసత్వంలోకి ఓ ఆత్మీయ ప్రయాణం లాంటిది. ఇందులో వనమూలికలు, సహజ వనరులను ఉపయోగించి, లెక్కలేనన్ని వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయని చెప్పబోతున్నాం. దీనికి దీపక్ కుమార్ పాధి చక్కని విజువల్స్ అందించారు’’ అని తెలిపారు. ఈ పాట మన నేల శక్తి ద్వారా మానవాళికి దోహదపడిన ఋషులు, వైద్యులకు తామిస్తున్న నివాళి అని పా. విజయ్ చెప్పారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా నిర్మించిన ‘అఘతియా’ మూవీ ఫిబ్రవరి 28న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
