Telangana Politics

Telangana Politics: చర్చకు సిద్ధమంటూ మంత్రుల బైఠాయింపు.. సవాల్ స్వీకరించి బయల్దేరిన హరీష్ రావు!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం మరోసారి పీక్స్‌కు చేరింది. గురుకులాల టెండర్లు, గత ప్రభుత్వ అప్పులు, ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరుపక్షాలు చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ వేదికలను ఖరారు చేసుకోవడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.

1. అమరవీరుల స్థూపం వేదికగా మంత్రుల ధీమా

గురుకులాల నిధుల ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా నివేదికలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. అభివృద్ధి, పరిపాలనపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, నేత అజారుద్దీన్‌లతో కలిసి గన్ ఫౌండ్రీ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.

గురుకులాల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, ఒకవేళ ఆరోపణలు నిరూపిస్తే తాము ఎలాంటి చర్యలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. వీటికి సంబంధించిన ఆధారాలను ప్రెస్ క్లబ్ వేదికగా కూడా పంచుకుంటామన్నారు.

ఈ సవాల్‌ను ప్రారంభించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెంటనే చర్చకు రావాలని, లేదా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏ శాఖపై ప్రశ్నించినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

2. సవాల్‌ను స్వీకరించిన ప్రతిపక్షం: “మేమే వస్తున్నాం”

మంత్రుల సవాలుపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వెంటనే స్పందించారు. తాము చర్చల నుండి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తొలత ప్రెస్ క్లబ్ వేదికగా చర్చ అనుకున్నప్పటికీ, మంత్రులు అమరవీరుల స్థూపం వద్దకు రావాలని కోరడంతో, ఎలాంటి భేషజాలు లేకుండా తాము గన్ పార్క్ వద్దకే వస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు.

తాము గన్ పార్క్ వద్దకు బయల్దేరుతున్నామని, ఈ లోగా మంత్రులు అక్కడి నుండి వెళ్ళిపోకూడదని.. అలాగే మధ్యలో తమను పోలీసులు అరెస్ట్ చేసేలా ఎలాంటి వ్యూహాలు పన్నకూడదని కోరారు. రాష్ట్ర అప్పులు, అవినీతి ఆరోపణలపై గన్ పార్క్ వేదికగా సాయంత్రం వరకు సుదీర్ఘంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *