Peddi: రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి ప్రముఖులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్పై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Also Read: Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్పై కుట్ర.. కెరీర్కు బ్రేకులు?
వినాయక చవితి సందర్భంగా ఈ సింగిల్ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2026 మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. రెహమాన్ మ్యాజిక్తో ఈ సింగిల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
