School Teachers

School Teachers: స్కూల్లో పిల్లలను కొట్టే టీచర్లకు పెద్ద షాక్.. ఇకపై అలా చేస్తే కేసులతో సరదా తీర్చేస్తారు

School Teachers: రాష్ట్రంలోని ప్రభుత్వ – ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో శారీరక దండన సంఘటనలను నివారించాలని, తప్పు చేసిన ఉపాధ్యాయులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా విద్యా అధికారులను (DEO) ఆదేశించింది. ప్రభుత్వ – ప్రైవేట్ పాఠశాలల్లో శారీరక దండన సంఘటనలపై కఠినమైన నిఘా ఉంచాలని సూచించింది. అలాగే వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (DPI) తన ఉత్తర్వులో DEOలను కోరింది.

Also Read: Prapancha Charitra: చరిత్ర భవిష్యత్తుకు దిక్సూచి.. ప్రపపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు నాయుడు

విద్యార్థులను కొట్టడం శిక్షార్హమైన నేరమని, దీనికి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. తప్పనిసరి విద్య చట్టం ప్రకారం విద్యార్థులను శారీరకంగా, మానసికంగా హింసించడం, వివక్ష చూపడం నిషేధించబడిందని DPI ఉత్తర్వులో పేర్కొంది. పాఠశాలల్లో విద్యార్థులకు విధించే శారీరక శిక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్ బాలల రక్షణ కమిషన్ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వెలువడింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bishnoi Gang: సల్మాన్ ఖాన్ నే ముందు చంపాలనుకున్నాం.. కానీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *