Telangana: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
Telangana: క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో రెండు బస్సులు దెబ్బతిన్నాయి. ఢీకొన్న సమయంలో ప్రయాణికులు కేకలు వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.