Road Accident:

Road Accident: వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురి దుర్మ‌ర‌ణం.. ఆరుగురికి తీవ్ర‌గాయాలు

Road Accident: వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. రోడ్డుపై ఏం జ‌రుగుతుందో తెలిసేలోగా ఏడుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. భారీ ప‌ట్టాల‌ను త‌ర‌లిస్తున్న లారీ.. ఆటోను ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంద‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. రోడ్డుపై క్ష‌త‌గాత్రుల హాహాకారాల‌తో తీవ్ర విషాదం అలుముకున్న‌ది.

Road Accident: వ‌రంగ‌ల్ జిల్లాలోని మామునూరులోని భార‌త్ పెట్రోల్ పంపు స‌మీపంలో రైలు ప‌ట్టాల లోడుతో వెళ్తున్న లారీ ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆటోను ఢీకొన్న‌ది. ఈ ఘ‌ట‌న‌తో ఆటోపై భారీగా ఉన్న రైలు ప‌ట్టాలు ప‌డ్డాయి. కొన్ని ప‌ట్టాలు ఇత‌ర వాహ‌నాల‌పైనా ప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ఆటోలో, ఇత‌ర వాహ‌నాల్లో క‌లిపి ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.

Road Accident: వ‌రంగ‌ల్ జిల్లాలోని మామునూరు వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయాలయ్యాయి. ఇంకొంద‌రికి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే స‌మీప ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. భారీగా ఉన్న ప‌ట్టాలు రోడ్డుపై, వాహ‌నాల‌పై ప‌డి ఉండ‌టంతో వాటిని తొల‌గించేందుకు పోలీసులు, వాహ‌నదారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *