Raghunandan rao: కేటీఆర్ కు ఈడి నోటీసులపై వకీల్ సాబ్ షాకింగ్ కామెంట్స్..

Raghunandan rao: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో నిధులు విదేశీ కంపెనీలకు తరలించడంపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ, ఈ చర్యలపై కేటీఆర్ తప్పకుండా వివరణ ఇవ్వాలని అన్నారు.

రఘునందన్ రావు.. కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు సుదీర్ఘ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని, అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. దమ్మున్న వారు విచారణను సమర్థంగా ఎదుర్కోవాలని, కోర్టు రక్షణ పొందడం రాజకీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కాదని వ్యాఖ్యానించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *