PM Modi: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) 57వ దీక్షాంత సమారోహం (స్నాతకోత్సవం) శనివారం (ఆగస్టు 8, 2026) అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
డిగ్రీ ఒకరోజుతో వచ్చేది కాదు.. మీపై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది.. ప్రధాని మోదీ
ఈ డిగ్రీ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో పరీక్షలు, తరగతులు, చిన్న చిన్న అడుగులు దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. నేటి నుంచి మీ జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలవుతోంది. దేశ యువతను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్ భారత నిర్మాతలు మీరే.. దేశ స్వప్నాలను మీరే సాకారం చేస్తారు! కాకపోతే, అవార్డులు సాధించిన విజేతలలో మరికొందరు అమ్మాయిలు ఉంటే నా ఆనందం రెట్టింపయ్యేది.— నరేంద్ర మోదీ (భారత ప్రధాని)
ప్రస్తుతం 4.5 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో 7 కొత్త ఐఐటీలు (IITs), 9 ఐఐఎంలు (IIMs), 13 ఎయిమ్స్ (AIIMS) సంస్థలను ప్రారంభించాం. సైన్స్, టెక్నాలజీ (STEM) విభాగాల్లో మహిళల భాగస్వామ్యం 44 శాతానికి చేరడం ప్రపంచంలోనే అత్యుత్తమ రికార్డు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్పర్సన్ హరీష్ సాల్వే, డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఐఐటీయన్లు తమ సాంకేతిక పరిజ్ఞానంతో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
