Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 71,000కు పైగా రిక్రూట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. దేశ నిర్మాణం, స్వయం సాధికారతలో పాల్గొనేందుకు యువతకు అర్థవంతమైన అవకాశాలను అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు .. విభాగాలకు రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి.
గత 18 నెలల్లో దాదాపు 10 లక్షల మందికి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గత 1 నుండి 1.5 సంవత్సరాలలో మా ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. స్వతహాగా ఇది చాలా పెద్ద రికార్డు. గత ఏ ప్రభుత్వ హయాంలో యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు ప్రధాని మోదీ.
ఇది కూడా చదవండి: Weather Report: మంచులో మునిగిపోయిన మూడు రాష్ట్రాలు.. అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ జామ్
Narendra Modi: నేను కువైట్ నుంచి అర్థరాత్రి తిరిగొచ్చాను. అక్కడ నేను భారతదేశంలోని యువత .. వృత్తి నిపుణులతో సుదీర్ఘంగా సమావేశమయ్యాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత యువతతో తొలి కార్యక్రమం నిర్వహిస్తున్నాను. దేశంలోని వేలాది మంది యువత కలలు సాకారం కావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు ప్రధాని మోదీ.
రోజ్గార్ మేళా అనేది ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా ఒక అడుగు. యువత దేశ నిర్మాణం .. స్వయం సాధికారతలో పాల్గొనేందుకు ఇది అవకాశాలను కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు .. విభాగాలకు రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోస్ట్ల శాఖ, ఉన్నత విద్యా శాఖ, ఆరోగ్య .. కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు .. విభాగాల్లో చేరతారు.