Hyderabad: ఎక్క‌డి ప్ర‌యాణికులు అక్క‌డే.. బ‌స్సులో 15 లక్ష‌ల న‌గ‌లు చోరీ!

Hyderabad:ఎక్క‌డి ప్ర‌యాణికులు అక్క‌డే ఉన్నారు.. ఎవ‌రి సీట్ల‌లో వారు కూర్చున్నారు.. కానీ ఓ ప్ర‌యాణికురాలి బ్యాగులో న‌గ‌లు చోరీ అయ్యాయి. ల‌బోదిబోమన‌డం ఆమె వంత‌యింది. మ‌రి ఆ దొంగ‌త‌నం చేసింది ఎవ‌రు? ఎలా జ‌రిగింది? దొంగ‌లు ఎటు వెళ్లారు? ఏమై ఉంటారు? అన్న విష‌యం తేల్చుకునేందుకు ఏకంగా ఆ బ‌స్సు డ్రైవ‌ర్ బ‌స్సును డైరెక్ట్‌గా పోలీస్‌స్టేష‌న్‌లోప‌లికే తీసుకెళ్లాడు. జ‌రిగిన చోరీ గురించి చెప్పుకున్నారు. ఇద‌న్న‌మాట‌.

Hyderabad:అస‌లేం జ‌రిగిందంటే? ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మండ‌పేట నుంచి హైద‌రాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు 40 మంది ప్ర‌యాణికుల‌తో వ‌స్తున్న‌ది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆ బ‌స్సులో భారీ చోరీ జ‌రిగింది. ఓ మ‌హిళ బ్యాగులో ఉన్న రూ.15 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలను ఎవ‌రో దొంగిలించారు. ఈ విష‌యాన్ని గుర్తించిన స‌ద‌రు మ‌హిళ జ‌రిగిన విష‌యం ప్ర‌యాణికుల‌కు, డ్రైవ‌ర్‌కు తెలిపింది.

Hyderabad:దీంతో డ్రైవ‌ర్ సమ‌య‌స్ఫూర్తితో ఏకంగా బ‌స్సును హైద‌రాబాద్ స‌మీపంలోని మార్గ‌మ‌ధ్యంలో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేష‌న్ లోప‌లికి తీసుకెళ్లాడు. అక్క‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఉద‌యం నుంచి 40 మంది ప్ర‌యాణికుల‌ను పోలీస్‌స్టేష‌న్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. ఇంకా దొంగెవ‌రో తేల‌లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైదరాబాద్ బ్యాంకాక్ విమానానికి బాంబు బెదిరింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *