Nitish Kumar Reddy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్లో నితీష్ రెడ్డి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో భారత్ జట్టు మ్యాచ్ పై తన పట్టు జారిపోకుండా చూసుకోగలిగింది. నిజానికి భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. అయితే, ఈ దశలో నితీష్ రెడ్డి తన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కంటే 116 పరుగుల వెనుకబడి ఉంది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డి 105 పరుగులతోనూ, మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. శనివారం మెల్బోర్న్లో భారత్ 164/5 స్కోరుతో ఆట ప్రారంభించింది. రిషబ్ పంత్ 6 పరుగులు, రవీంద్ర జడేజా 4 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు.
తొలి సెషన్లో 28 పరుగుల వద్ద పంత్ ఔట్ కాగా, 17 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యారు. అప్పుడు టీమ్ ఇండియా స్కోరు 221/7. ఈ దశలో రంగంలోకి దిగిన నితీశ్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. నితీష్ జాగ్రత్తగా పరుగులు సాధించి 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఆసీస్ బౌలర్లను వెంటాడిన యువ స్ట్రైకర్ టీమిండియా స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక్కడి నుంచి నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్కు 285 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ఫాలో ఆన్ను తప్పించారు. 162 బంతుల్లో 50 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరఫున పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ 3-3 వికెట్లు తీశారు. నాథన్ లియాన్ 2 వికెట్లు తీశాడు. డిసెంబరు 27వ తేదీ శుక్రవారం ఒకరోజు ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేసింది.
ఇది కూడా చదవండి: Border Gavaskar Trophy: నాలుగో టెస్ట్ లో ముగిసిన తొలిరోజు ఆట.. ఆసీస్ దే పైచేయి!
నితీష్ రెడ్డి సెంచరీ సాధించిన క్షణాల్లో..
తెలంగాణకు చెందిన నితీష్ రెడ్డి టెస్టుల్లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన 115వ ఓవర్ వేసిన స్కాట్ బోలాండ్ వేసిన మూడో బంతిని ఫోర్ కొట్టి తొలి సెంచరీ పూర్తి చేశాడు.
సెంచరీ పూర్తి చేసిన తర్వాత, నితీష్ గ్రౌండ్ లో మోకాళ్లపై కూర్చుని, మైదానంలో బ్యాట్ను ఉంచి, హెల్మెట్కు వేలాడదీయడం ద్వారా సంబరాలు చేసుకున్నాడు. అతను ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు.అంతకు ముందు నితీష్ రెడ్డి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సమయంలో బ్యాట్ తో పుష్ప సినిమా హీరో టైప్ లో బ్యాట్ తో తన గెడ్డంపై “తగ్గేదేలే” అనే తరహాలో సంకేతాలు చేశాడు. అన్నట్టుగానే ఎక్కడా తగ్గకుండా ఆరంగేట్రంలోనే సెంచరీ సాధించి ప్రత్యేకతను సాధించాడు.
నితీష్ రెడ్డి స్పందన ఇదే..
నితీష్ రెడ్డి సెంచరీపై ఆయన తండ్రి స్పందించారు. “ఇది మాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పటి నుంచో నితీష్ అండర్ 14, అండర్ 16 స్థాయిలో క్రికెట్ ఆడుతున్నాడు. అప్పటి నుంచి అందరం చాలా కష్టపడ్డాం.” అని చెప్పారు.
Stumps on Day 3 in Melbourne!#TeamIndia reach 358/9 courtesy a unbeaten maiden hundred from Nitish Kumar Reddy and a fighting fifty from Washington Sundar 👍
Updates ▶️ https://t.co/njfhCncRdL#AUSvIND pic.twitter.com/K8T2kZMsPh
— BCCI (@BCCI) December 28, 2024