Nepal Floods: నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదల విషాదం రోజురోజుకూ మరింత భయానక రూపం దాలుస్తోంది. గత వారం ప్రారంభమైన ఈ జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1000కి పైగా చేరుకుంది (నేపాల్లో దాదాపు 987, టిబెట్ పరిధిలో 16 మంది). వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో హిమాలయ లోయల్లో ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. భారీ వర్షాలు, మోకాళ్ల లోతు బురద, కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన వంతెనల నడుమ సుమారు 22 వేల మందికి పైగా సైనిక, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఒకే ఇంట్లో 23 మృతదేహాలు – యూపీ నదిలో తేలిన శవాలు..
సొరంగాల్లో చిక్కుకున్న 900 మందికి పైగా కార్మికులు..
మృతదేహాల గుర్తింపు కష్టతరం – సామూహిక ఖననం..
65 వేల మందికి అత్యవసర సాయం..
ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 11,800 మందిని సురక్షితంగా తరలించారు. అయితే సుమారు 39 దేశాలకు చెందిన 580 మందికి పైగా విదేశీయులు ఇంకా గల్లంతై ఉన్నట్లు సమాచారం. సుమారు 65 వేల మందికి తక్షణ తాగునీరు, ఆహారం, మందులు అవసరమని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరించింది. భారత్, చైనా, సింగపూర్ సహా పలు దేశాలు రెస్క్యూ కిట్లు, ఆహార సామగ్రితో సహాయం అందిస్తున్నాయి.
