Mumbai: ఈవీఎంలు ట్యాంపరింగ్..ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Mumbai: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినందుకే ఫలితాలు మారిపోయాయని ఆరోపించారు. 288 సీట్లలో 200కి పైగా సీట్లలో మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారని, అయితే కాంగ్రెస్ కూటమి 50 కంటే తక్కువ సీట్లలో లీడింగ్‌లో ఉందని తెలిపారు.

సంజయ్ రౌత్, మహాయుతి కూటమి అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే చేసిన ద్రోహంపై ప్రజలు ఆగ్రహం ఉన్నారని చెప్పారు. 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అఘాడీ కూటమికి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఫలితాలు ఇలా ఎందుకు మారాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల జయాలు సాధిస్తున్నట్లు ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యం మరలా హత్యకు గురైందని సంజయ్ రౌత్ అన్నారు

.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *