గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లను అధిక ధరకు కొనుగోలు చేశారు. మొదటి మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీ సాధించాడు కానీ అదే ప్రదర్శనను కొనసాగించడంలో విఫలమయ్యాడు. మహమ్మద్ షమీ. వేలంలో సన్రైజర్స్ అతన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. భువి మరియు నటరాజన్ లేని లోటును షమీ భర్తీ చేయగలడని సన్రైజర్స్ బోర్డు భావించింది.
ఇది కూడా చదవండి: India vs England: ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీళ్లే
IPL 2025 సీజన్లో మహమ్మద్ షమీ 9 మ్యాచ్లు ఆడి కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పేలవమైన ప్రదర్శన కారణంగా, అతన్ని కొన్ని మ్యాచ్ల నుండి తొలగించాల్సి వచ్చింది. తీసుకున్న డబ్బుకు న్యాయం చేయడంలో మహమ్మద్ షమీ పూర్తిగా విఫలమయ్యాడు.
ఈ లెక్కన, షమీ తీసిన ప్రతి వికెట్ కు రూ.1.66 కోట్లు సంపాదించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముందుగానే వికెట్లు తీయడం ద్వారా అతను సహాయం చేస్తాడని మీరు అనుకుంటే, షమీ ఓవర్ కు 10 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు.