Missing Case:

Missing Case: సిరిసిల్ల జిల్లాలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి అదృశ్యం.. డీపీవోకు రాజీనామా.. కారణాలు ఇవే..

Missing Case: అధికార పార్టీ నాయ‌కుల వేధింపులు అంతా ఇంతా కాదు అన‌డానికి ఈ ఘ‌ట‌నే ఓ నిద‌ర్శ‌నం. ఆ పార్టీ, ఈ పార్టీ అనే కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తంతు అని అంద‌రికీ తెలుసు. కాకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ది కాబ‌ట్టి.. ఇప్పుడు ఆ పార్టీ వంత‌యింది. రాష్ట్రంలో ప‌లుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ‌డాలు మితిమీరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మ‌హిళ అయిన‌ ఓ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిపై కాంగ్రెస్ నాయ‌కుల తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌ కార‌ణంగా ఆమె క‌నిపించ‌కుండా పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆమె ఏకంగా డీపీవోకు త‌న రాజీనామా లేఖ‌ను పంప‌డం సంచ‌ల‌నంగా మారింది.

Missing Case: రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ అర్బ‌న్‌ మండ‌లం చింత‌ల్‌ఠాణాకు చెందిన ప్రియాంక‌, తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం బ‌ద్దెన‌ప‌ల్లిలో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌హిస్తున్న‌ది. ఆమె త‌ల్లిదండ్రుల‌కు రాసిన ఓ లేఖ క‌ల‌క‌లం రేపింది. అమ్మా, నాన్న నేను ఇల్లు వ‌దిలి పోతున్నా. ఈ కాంగ్రెస్ నాయ‌కుల వేధింపులు త‌ట్టుకోలేక‌పోతున్న‌.. అంటూ లేఖ రాసిన ప్రియాంక క‌నిపించ‌కుండా పోయింది.

Missing Case: ఇదే స‌మ‌యంలో జిల్లా పంచాయ‌తీ అధికారికి కూడా ప్రియాంక వాట్స‌ప్ ద్వారా త‌న ఉద్యోగానికి రాజీనామా లేఖ‌ను పంపింది. ఈలోగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బ‌ద్దెన‌ప‌ల్లి గ్రామానికి చెందిన న‌లుగురు కాంగ్రెస్ నాయ‌కులు త‌న‌ను వేధిస్తున్నార‌ని, ఇంకుడు గుంత‌ల విష‌యంలో పంచాయ‌తీ కార్యాల‌యంలో అంద‌రి ముందే త‌న‌ను తీవ్రంగా దూషించార‌ని ప్రియాంక త‌న లేఖ‌లో పేర్కొన‌డం గమ‌నార్హం.

Missing Case: ఇందిర‌మ్మ ఇండ్ల జాబితాలో తాము చెప్పిన వారినే ఎంపిక చేయాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు బెదిరించార‌ని పంచాయ‌తీ కార్యాల‌య సిబ్బంది కూడా తెలిపారు. సోమ‌వారం రోజే ఎంపిక చేసిన‌ ఇందిర‌మ్మ ఇండ్ల జాబితాను అంద‌జేయాల్సి ఉండ‌గా, ప్రియాంక త‌ల్లిదండ్రుల‌కు, డీపీవోకు రాజీనామా లేఖ‌ను పంపి అదృశ్య‌మయ్యారు.

Missing Case: ఈ నేప‌థ్యంలో ప్రియాంక కుటుంబ స‌భ్యులు సిరిసిల్ల డీఎస్పీని క‌లిసి జ‌రిగిన విష‌యంపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక డైరీ, ఆమె రాసిన లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఫోన్ ట్రేస్ చేయ‌డంతో తిరుప‌తిలో ఉన్న‌ట్టు చూపుతున్న‌ద‌ని గుర్తించారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆమె కోసం తిరుప‌తి బ‌య‌లుదేరి వెళ్లారు.

Missing Case: ఇదే స‌మ‌యంలో ప్రియాంక కుటుంబ స‌భ్యులు చెప్పిన మ‌రో విష‌యం కీల‌కంగా మారింది. గ‌త కొన్నాళ్లుగా ఆ కాంగ్రెస్ నాయ‌కులే ప్రియాంక‌ను వేధిస్తున్నార‌ని తెలిపారు. ఆ విష‌యం తెలిసి తాము కూడా వెళ్లి త‌మ కూతురుపై వేధింపులు ఆపాల‌ని అదే కాంగ్రెస్ నాయ‌కుల‌ను వేడుకున్నామ‌ని, అయినా వారు విన‌కుండా అదే వేధింపులకు గురి చేయ‌డంతోనే త‌మ కూతురు మ‌న‌స్తాపంతో అదృశ్య‌మైంద‌ని ప్రియాంక తండ్రి రాజేశం ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ALSO READ  Nalgonda: తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *