Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన పరకాల వివాదం అనంతరం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై క్రమశిక్షణా కమిటీ నోటీసుల తర్వాత కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, సీఎంతో భేటీ ముగిసిన తర్వాత మంత్రి కొండా సురేఖ మీడియాతో ఎలాంటి మాట్లాడకుండానే మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పరకాల వేదికగా మొదలైన అసలు వివాదం..
ఏఐసీసీ కోర్టులో బంతి – వేటు తప్పదా?:
-
నివేదిక సమర్పించిన క్రమశిక్షణా కమిటీ: సురేఖ సమాధానంపై సంతృప్తి చెందని పీసీసీ క్రమశిక్షణా కమిటీ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ పూర్తి నివేదికను ఏఐసీసీకి పంపించింది.
-
మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క భేటీలు: ఈ వ్యవహారం పూర్తిగా ఏఐసీసీ పరిధిలోనే ఉందని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
భవిష్యత్ పరిణామాలు: కేబినెట్ నుంచి సురేఖను ఇప్పుడే తప్పించాలా? లేక మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ వరకు వేచి చూడాలా? అనేదానిపై హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది.
ఒకవైపు పార్టీ పరంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుండగా.. రక్షాబంధన్ వేళ సురేఖ స్వయంగా సీఎంకు రాఖీ కట్టడం వెనుక డ్యామేజ్ కంట్రోల్ వ్యూహం ఉందా లేదా అనేది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
