Hyderabad: ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ బావమరిదికి నోటీసులు..

Hyderabad: జన్వాడ రేవ్ పార్టీ కేసులో మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే రాజ్‌ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన కేసులో విచారించాల్సి ఉందని, ఈ రోజు (సోమవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో పోలీసులు కోరారు.

అలాగే అడ్రస్ ప్రూఫ్‌తో పాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని సూచించారు. అంతేకాకుండా ఒకవేళ ఈ నోటీసులను బేఖాతరు చేసి విచారణకు హాజరు కాని పక్షంలో చట్ట పరంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

మరోవైపు, తనని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనని అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్‌ పాకాల తరపున లాయర్ వినయ్ వర్మ వాసిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *