Kavita: కాంగ్రెస్ లో కుల రాజకీయాలు నడుస్తున్నాయి..

Kavita: తెలంగాణలో జరిగిన నంబాల ఎన్‌కౌంటర్పై ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించిన ఆమె, “ఆపరేషన్ కగార్‌”ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

కవిత మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం దారుణమని, ఇది మానవత్వానికి విరుద్ధమని విమర్శించారు.

“పోలీసులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు, నైతిక విలువలు పక్కనపెట్టి, దారుణంగా వ్యవహరిస్తున్నారు” అని ఆమె మండిపడ్డారు.

అదేవిధంగా, ఇటీవల జరిగిన సరస్వతి పుష్కరాల్లో దళిత ఎంపీ వంశీకి జరిగిన అవమానంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక దళిత ఎంపీని సభా వేదికపై నుంచి కిందకు దించటం దారుణం. అంతే కాదు, యాదాద్రి ఆలయంలో భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి అవమానించారు” అని కవిత ఆక్షేపించారు.

కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆమె,

“దళితుల పట్ల కాంగ్రెస్‌కు గౌరవం లేదు. వారి పాలనలో కులపరమైన వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆర్జున్ రెడ్డి నిమ్నవర్గాలపై తక్కువ చూపు చూపుతున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెసులో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: బిగ్ బ్రేకింగ్..అప్రూవర్ గా పొన్నవోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *