India VS Pakisthan: పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో దేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. మే నెల 15 వరకు వాటిని మూసి వేసి ఉంచనున్నట్టు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని ఆకాశమార్గాలు నిశ్శబ్దంగా మారనున్నాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, పాక్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని ఏఏఐ అధికారులు ప్రకటించారు.
India VS Pakisthan: ఈ ఆకస్మిక నిర్ణయంతో దేశంలో 32 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. వీటిలో అధంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపూర్, భటిండా, భుజ్, బికనూర్, చండీఘర్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్ము, జామ్నగర్, జోధ్పూర్, కండ్ల, కాంగ్రా (Gaggal), కెషోడ్, కిషన్గఢ్, కులు మనాలి, లేహ్, లూధియానా, ముంద్రా, నలియా, పఠాన్కోట్, పాటియాలా, పోరుబందర్, రాజ్కోట్, సర్సవా, సిమ్లా, శ్రీనగర్, థోస్, ఉత్తర్లాయి విమానాశ్రయాలను మూసి ఉంచనున్నట్టు ఏఏఐ ప్రకటించింది.
India VS Pakisthan: గతంలో మే 8న 24 విమానాశ్రయాలను తాత్కాలిక మూసివేతకు నిర్ణయం తీసుకున్న ఏఏఐ.. తాజాగా 32 విమానాశ్రయాల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల వెంట ఉన్న రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాల మూసివేతకు ఈ నిర్ణయం తీసుకున్నది.